ఖమ్మం
ఖమ్మం నియోజకవర్గం లో అధికార పక్షం బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలం రఘునాధ పాలెం. రఘునాధపాలెం బిఆర్ఎస్ యంపిపి భూక్యా గౌరి , పాపటపల్లి మాజీ సర్పంచ్ లాలు, పలువురు బిఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేసారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ సమక్షంలో చేరారు ఎంపిపి గౌరి , మాజీ సర్పంచ్ లాలు తో పాటు పలువురు నేతలు కుడా . కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రఘునాథపాలెంలో ఉన్న ఏకైక యంపిపి రాజీనామా చేయడంతో షాక్ లో బిఆర్ఎస్ నేతలు వున్నారు.