YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం

ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం

న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. పెపెచ్చు చలికాలం మొదలు కావడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. కాలుష్యం పెరగటంతో శుక్రవారం నుంచి ప్రైమరీ క్లాసులకు సెలవులు ప్రకటించారు.  ఆన్లైన్లో క్లాసులు కొనసాగించాలని రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర మినహా అన్నీ రకాల భవన నిర్మాణాలను సైతం ఆపివేసారు. బీఎస్ 3, బీఎస్ 4 డిజిల్ వాహానాల రవాణాను నియంత్రించారు.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రాం, గజియాబాద్, ఫరిదాబాద్ లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పొరుగునున్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను కాల్చడంతో   అధిక శాతం ఈ వైపరిత్యం ఏర్పడింది.

Related Posts