YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దళిత యువకుడిపై దాడి..దళిత సంఘాల ధర్నా

దళిత యువకుడిపై దాడి..దళిత సంఘాల ధర్నా

కంచికచర్ల
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రధాన అనుచరుని కొడుకు హరీష్, అతని అనుచరులు నాలుగుగంటలపాటు నిర్బంధించి, దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.  దాహంవేసి మంచినీళ్లు అడిగితే, సభ్యసమాజం తలదించుకునేలా మూత్రంపోసి అవమానించారని దళిత సంఘాలు ఆరోపించాయి. ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ శనివారం  రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కంచికచర్ల దగ్గర హైవే దిగ్బంధం చేసి నిరసన ధర్నా కు దిగారు. దాంతో హైవే మొత్తం రెండు వైపులా దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడం జరిగింది.

Related Posts