YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చిత్తశుద్ధితో 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం

చిత్తశుద్ధితో 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం

మధిర
సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క సోమవారం నాడు ఎర్రుపాలెం మండలం, రామన్నపాలెం లో ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు వందలాది బైక్లతో ర్యాలీ నిర్వహించి భట్టి జిందాబాద్..  భట్టి సీఎం అంటూ నినాదాలను హోరెత్తించారు. దారి పొడవున బంతిపూల వర్షం కురిపించి ప్రజలు, పార్టీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామంలో జరిగిన ఎన్నికల సభలో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రసంగించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ బిఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు బందు చేస్తామని భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి తెలంగాణలో లేదు. దొరల ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం తీసుకొస్తున్నది. ప్రజల సంపదని దోపిడి చేసి అత్యంత అవినీతిపరులుగా  బిఆర్ఎస్ పాలకులు మారారని అన్నారు. బిఆర్ఎస్ పాలకుల అవినీతి దోపిడి వల్లనే తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర సంపద ప్రజలందరి పంచాలన్న రాహుల్ ఆకాంక్షలు నెరవేరుస్తాం. ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చుకోవాలి. దళిత బంధు పథకం కంటే మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయ హస్తం పథకం తీసుకువచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడుతుంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.
రాష్ట్ర రాబడి, బడ్జెట్పై ఆర్థిక లెక్కలు తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉంది. ఆరు గ్యారెంటీల అమలుకు పాలకుల ఆర్థిక దోపిడిని ఆరికడితే చాలు... వాటిని అమలు చేయడం పెద్ద కష్టం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి దోపిడీకి తావులేదు. చిత్తశుద్ధితో 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలనే బిఆర్ఎస్ కాపీ కొట్టి మేనిఫెస్టోగా ప్రకటించింది. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్  ప్రభుత్వం ఇల్లు ఉద్యోగాలు ఇవ్వలేదు. రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వలే, సబ్సిడీ ఎరువులు ఇవ్వలే, మద్దతు ధర ఇవ్వలే, మహిళలకు పావుల వడ్డీ రుణాలు ఇవ్వలే,  పేదలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే తొమ్మిది రకాల నిత్యవసర సరుకులకు మంగళం పాడింది. అమ్మహస్తం పథకం అటక ఎక్కించి రేషన్ దుకాణాలను బియ్యం దుకాణాలుగా  బిఆర్ఎస్ ప్రభుత్వం మార్చింది. మహిళలు పెళ్లీడు వచ్చేనాటికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రెండు లక్షల పదహారువేల రూపాయల బంగారు తల్లి పథకాన్ని చంపేసి బిఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తెచ్చి లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వడం దౌర్భాగ్యమని అన్నారు.

Related Posts