నల్గోండ
ఎన్నికల నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి కే అపూర్వ రావు హెచ్చరించారు. జిల్లాలో శాసన సభ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణం లోజరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆమె అన్నారు. ఎన్నికల వేళ శాంతి భద్రతల విఘాతం కలిగించే వారి పట్ల ఎప్పడికప్పుడు నిఘా పెడుతున్నామని అన్నారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్లు,గత ఎన్నికల్లో శాంతి భద్రతల విఘాతం కల్గించి పలు కేసులలో ఉన్న వారిని ఇప్పటికే బైండోవర్ చేశామని అన్నారు. ఎవరైన రౌడీ కార్యకలపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే డైయల్ 100 గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని అమె సూచించారు.