YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విపక్షాలు ఎన్ని ట్రిక్కులు వేసినా, బీఆర్ఎస్ గెలుపు ఖాయం

విపక్షాలు ఎన్ని ట్రిక్కులు వేసినా, బీఆర్ఎస్ గెలుపు ఖాయం

హైదరాబాద్
అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం చేశాయని, సీఎం కేసీఆర్  పాలనపై ప్రజలకు ఉన్న చెక్కుచెదరని విశ్వాసానికి ఇది నిదర్శనం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం కోకాపెట్ లోని మంత్రి నివాసం వద్ద అంబర్ పేటకు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్, బిజెపి ఎన్ని ట్రిక్కులు వేసినా వచ్చేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే అని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి మోడల్ కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ మరింత అభివృద్ది చెందుతుంది అని చెప్పారు. పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. పార్టీలో చేరిన వారిలో, అంబర్పేట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బిల్డర్ ప్రవీణ్ , రాచర్ల భాస్కర్, నల్ల అనిల్ కుమార్, రజనీకాంత్, మధుసూదన్, రాజ్ కుమార్, సుభాష్ నాయక్, శివకుమార్, దినేష్ రేవల్లి, విన్ను, సాయికుమార్, జి సత్యనారాయణ, శివ, దుర్గాప్రసాద్, ఫిలిప్స్, మహమ్మద్ కాలిద్, బాలాజీ, నాగరాజ్, హర్షవర్ధన్, సాయి మనీష్, విట్టల్ ప్రవీణ్ డ్రైవర్, రాజేష్, శ్రీనివాస్, మరియు సూరజ్ తదితరులు ఉన్నారు.

Related Posts