YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బహుజన సమాజ్ పార్టీ కి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి

బహుజన సమాజ్ పార్టీ కి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి

నాగర్ కర్నూల్  
భాహుజన సమాజ్ పార్టీ కి ప్రతి ఒక్కరు ఓటు వేయాలనీ ,బీఎస్ పి నాయకులు నాగార్జున అన్నారు.గురువారం అచ్చంపేట నియోజక వర్గంలో భాహుజన సమాజ్ పార్టీ  అభ్యర్థి మోత్కూరు నాగార్జున అసెంబ్లీ ఎన్నికల లో ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ రిటర్నింగ్ అధికారి కి నామినేషన్ పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పొలిటికల్ పవర్ కోసం అందరూ తరలివచ్చారు మన అచ్చంపేటలో అందరికి ప్రత్యేక జై భీమ్లు.నాకు సహకరించిన ,నామినేషన్ ల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు, తెలుపుకుంటున్నాను. మీ అందరి సహకారం ఎప్పటికీ వుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలో మర్చిపోలేను మీ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాను అచ్చంపేట ప్రజలే ,వారి కోసమే నా జీవితం ఖచ్చితంగా మీ కోసమే మీ వెంటనే ఉంటాను మీ సమస్యలను పరిష్కరిస్తాను.మన మహనీయుల ఆశయాలను నెరవేర్చడమే మన బహుజన రాజ్యం కోసం మీరందరూ కంకణ బద్దులు అయ్యి మన రాజ్యాంగ నిర్మిస్తారని విశ్వసిస్తున్నాను.నిన్నటి రోజున నామినేషన్ కు దొరల,రెడ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ అగ్రవర్ణాల (దొరల,రెడ్లలో పేదలు) 85% ఉన్నటువంటి నా బహుజన నీలి జెండాలు..
నామినేషన్ వేయడానికి బహుజన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సారి  బహుజనులను గెలిపించాలని ఏనుగు కి ఓటు వేస్తామని హామీ ఇస్తూ... ఆశీర్వదించిన అచ్చంపేట ప్రజానీకం.అందరి తోడ్పాటుకీ  సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు ,అచ్చంపేట లో  నీలి జెండా ఎగరడం ఖాయం.వీర సైనికులుగా పనిచేస్తున్నా మన పార్టీ అసెంబ్లీ కమిటీ బాధ్యులు,  ప్రతి మండల బాధ్యులకు,  గ్రామ బాధ్యులకు , బూత్ కమిటీ బాధ్యతలు , సెక్టార్ కమిటీ లకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు ప్రత్యేక జై భీమ్ మీ సహకారం మనం గెలిచే వరకు ఇంతే శక్తితో ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను.

Related Posts