YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్, బీజేపీల తుది జాబితాలు విడుదల

కాంగ్రెస్, బీజేపీల తుది జాబితాలు విడుదల

హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో.. పటాన్చెరు నుంచి కట్టా శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ నుంచి మహమ్మద్ ముజీబుల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్రెడ్డి, తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం నుంచి మందుల శామ్యూల్కు టికెట్లు కేటాయించింది.
మరోవైపు,   బీజేపీ కుడా  14 మందితో తుది జాబితాని విడుదల చేసింది. ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా… బీజేపీ, జనసేనకు 8 సీట్లను ఇచ్చింది. మిగతా 111 స్థానాల్లో బీజేపీ నేతలు పోటీకి దిగుతున్నారు.
శుక్రవారంతో నామినేషన్ల గడువు వుండడంతో అభ్యర్థులు తమ పత్రాలతో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు పోటెత్తారు. ఇక ఈ నెల  13వ తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన,  15 వరకు నామినేషన్లను ఉపసంహరణ,  30న పోలింగ్ జరుగనుంది. గురువారం  ఒక్కరోజే 1077 నామినేషన్ల దాఖలు కాగా, ఇప్పటి వరకు మొత్తం 2,265 నామినేషన్లు దాఖలయ్యాయి.

బీజేపీ జాబితాలో రెండు మార్పులు
శుక్రవారం బీజేపీ విడుదల చేసిన తుది జాబితాలో రెండు మార్పులు జరిపమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇగుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. బెల్లంపల్లి  నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా  అమరజుల శ్రీదేవి బిజెపి అభ్యర్థిగా కొనసాగుతారు. శుక్రవారం  విడుదల చేసిన ప్రకటనలో ఏమాజీ పేరు రావడం జరిగింది. అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో  మేరెమ్మ స్థానంలో పార్టీ అభ్యర్థిగా రాజగోపాల్ పోటీ చేస్తున్నారు.  

Related Posts