YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అబద్దాలకు పేటెంట్ రైట్ కేసీఆర్ కి మాత్రమే

అబద్దాలకు పేటెంట్ రైట్ కేసీఆర్ కి మాత్రమే

కేసీఆర్ ఎన్నికల్లో ఎన్నో అబద్దాలు ఆడుతున్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఎప్పుడైనా ఇన్ని మీటింగ్ లు పెట్టారా...? అబద్దాలకు పేటెంట్ రైట్ కేసీఆర్ కి మాత్రమేనని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల ఆరోపించారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా పని చేస్తున్నారు. దళిత ద్రోహి కేసీఆర్ కి అవార్డు ఇవ్వాలి. దళిత ముఖ్యమంత్రి అన్నారు. దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ..దళితులకు సబ్ ప్లాన్ ఏమైంది. ఎంతమందికి దళితబంధు ద్వారా  10 లక్షల సహాయం చేశారు. బీఆరెస్ క్యాడర్ కి మాత్రమే దళితబంధు ఇచ్చారు. ఎంతమంది మాదిగలకు మంత్రి పదవులు ఇచ్చావు. మా మాదిగ సామాజిక వర్గానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలి. దళితులకు కాంగ్రెస్ ఎం చేసిందని అంటావా...? నువ్వు ముఖ్యమంత్రి అయ్యావంటే కాంగ్రెస్ వాళ్ళే. దళితుల కోసం ఎస్సి, ఎస్టీ డిక్లరేషన్  ప్రకటించింది కాంగ్రెస్. కేసీఆర్ తెలంగాణ బిడ్డల రక్తం తాగుతున్నావ్. నీ కుటుంబం మాత్రమే ఎలుతుంది. దళిత ద్రోహి  కేసీఆర్ మీద చీటింగ్ కేసు పెట్టాలి. కేసీఆర్ ఫ్యామిలీ ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లే దమ్ము ఉందా. ప్రాజెక్టుల్లో వేల కోట్లు దోచిన దొంగ హరీష్ రావు. మాకు బడ్జెట్ లో ఒక శాతం  కూడా కేటాయించడం లేదని అన్నారు.

Related Posts