YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నటుడు చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

నటుడు చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

విజయవాడ
ప్రముఖ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న నటుడు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నని అన్నారు.

Related Posts