హైదరాబాద్ నవంబర్ 11
ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని పనిచేసే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లో పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ప్రోగ్రామ్లో మంత్రి పాల్గొన్నారు. జేఆర్సీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ను బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తోందన్నారు.హైదరాబాద్లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ మహానగరానికి చారిత్రకంగా గొప్ప పేరుందని అన్నారు. పాత హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందినదని నటుడు రజినీకాంత్ పొగిడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధిలో హైదరాబాద్ న్యూయార్క్తో పోటీ పడుతోందని అన్నారు.గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైవోర్లు నిర్మించామని, 39 చెరువులను నవీకరించామని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ కార్యక్రమంతో హైదరాబాద్లో తాగునీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. అదేవిధంగా దేశంలో నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తుచేశారు.