హైదరాబాద్
సోమవారం నాడు నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అధికారులు చర్యలు ప్రారంభించారు. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ పై మూడు సెక్షన్ ల కింద కేస్ నమోదు చేసారు.
ఘటన జరిగిన వెంటనే రమేష్ జైస్వాల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. లకడికపూల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయు లో చేరారు. రమేష్ జైస్వాల్ హాస్పిటల్ లో ఉన్నట్టు అతడి కుటుంబీకులు
పోలీస్ లకు తెలిపారు. రమేష్ జైస్వాల్ డిశ్చార్జ్ కాగానే చర్యలు తీసుకోనున్న పోలీసులు వెల్లడించారు.