YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మృతి : మోత్కుపల్లి

 చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మృతి : మోత్కుపల్లి

ఇటీవలి కాలంలో పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్మృతి చిహ్నం వద్ద నివాళులర్పించిన మోత్కుపల్లి, చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హరికృష్ణ ను పక్కకుపెట్టారు. బాలకృష్ణ ను వాడుకొని వదిలేస్తారు. నందమూరి కుటుంబం నుంచి ఒకరు ఉన్నారనీ చెప్పడానికే బాలకృష్ణ కు ప్రాధాన్యత ఇస్తున్నారని అయన ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుంది..మాల,మాదిగల మధ్య, బీసీలకు, కాపులకుమధ్య చిచ్చుపెట్టింది బాబే నని అయన అన్నారు. హోదాపై నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు హోదా నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. కుట్ర, ద్రోహం అన్నవి చంద్రబాబు నైజాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ను కూలగొట్టే ప్రయత్నం చేసారు. చంద్రబాబుకు ఓటేయవద్దు ఓడించండని ఏపీ ప్రజలకు పిలుపు నిచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అవసరమైతే ఏపీలో తాను రథ యాత్ర చేస్తానని పేర్కొన్నారు.

Related Posts