యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ తండాలో బీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్నంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి స్నానం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి అతనికి స్నానం చేయిస్తూ మీ ఓటు కారు గుర్తుకు వేసి, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతని గెలిపించాలని సదరు కార్యకర్తలు ఓటర్లను అభ్యర్థించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి