హైదరాబాద్
తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయశాంతి బిజెపికి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా ఆమె బిజెపి పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఆమె పంపించారు. శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. విజయశాంతికి మెదక్ లోక్ సభ టికెట్ కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఇదివరకే మెదక్ టికెట్ ను గాలి అనిల్ కుమార్ కు కాంగ్రెస్ చెప్పింది. నర్సాపూర్, పటాన్ చెరు అసెంబ్లీ టికెట్లను ఆశించిన గాలి అనిల్ కు.. మెదక్ లోక్ సభ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ మళ్లీ విజయశాంతికి అదే టికెట్ ను ఆఫర్ చేయడంతో.. కాంగ్రెస్ కు గాలి అనిల్ కుమార్ రాజీనామా చేసారు.