హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
శుక్రవారం నాడు సనత్ నగర్ లోని సుభాష్ నగర్, సాయిబాబా నగర్, జై ప్రకాష్ నగర్, కైలాష్ నగర్ లలో అయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. రాష్ట్రంలో ని కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది. జరిగిన అభివృద్ధి, సంక్షేమ తో ప్రజలు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు.