కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.
ఎన్నికల ప్రచారం లో భాగం గాఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి ఎన్ఎల్బీ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రారంభమైన ఇంటింటి ప్రచారం షాపూర్ నగర్, సంజయ్ గాంధీనగర్, వివేకానంద నగర్ మీదగా శ్రీనివాసనగర్ కాలనీ నుండి రుడా మేస్త్రి నగర్, వల్లభాయ్ పటేల్ నగర్ లలో రోడ్ షో నిర్వహించి, ఖాజా పాన్ షాప్ వద్ద కార్నర్ మీటింగ్ తో రోడ్డు షో ముగిసింది. ఈ రోడ్ షో లో హన్మంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 6 గారంటీలను వివరించి రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జ్యోత్స్నా శివారెడ్డి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, అవిజె జేమ్స్, సంజీవ్ రెడ్డి, పండరి, డోరా అరుణ్, లలిత మరియు పార్టీ సీనియర్ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు..