YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫార్మ్ హౌస్ లోనే కేసీఆర్ వుండిపోతారు మల్లికార్జున ఖర్గే

ఫార్మ్ హౌస్ లోనే కేసీఆర్ వుండిపోతారు మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్
తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది. కొద్ది రోజులుగా కేసీఆర్కు భయం పట్టుకుంది.. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఎప్పుడూ ఫార్మ్ హౌస్లోనే ఉండే కేసీఆర్ ఇక.. అక్కడే ఉండిపోతరు.. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటరు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలు తున్నారని అన్నారు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ మేం నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. .

Related Posts