YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పెరిగిన మద్యం ధరలు వెంటనే అమలులోకి వచ్చిన నూతన రేట్లు

ఏపీలో పెరిగిన మద్యం ధరలు వెంటనే అమలులోకి వచ్చిన నూతన రేట్లు

విజయవాడ
ఏపీలో  మద్యం ధరలు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన రేట్లు వెంటనే అమలులోకి వచ్చాయి.
క్వార్టర్పై రూ.10, ఫుల్ బాటిల్పై రూ.20, ఫారిన్ లిక్కర్ ధరలు 20% పెంచారు. రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయల నుంచి శాతాల్లోకి ప్రభుత్వం మార్చింది. ఏఆర్ఈటీ శ్లాబులు రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై సమానంగా పన్నులు  లేవు. అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్ఈటీని శాతాల్లోకి  ఎక్సైజ్ శాఖ మార్చింది. ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం పెంచారు. బీరుపై 225 శాతం, వైన్పై 200 శాతం, ఫారిన్ లిక్కర్పై 75 శాతం ఏఆర్ఈటీ పెంచారు. ఒక ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే రూ.590కి పెంచారు. మరో బ్రాండ్ క్వార్టర్ రూ.200 నుంచి రూ.210కి పెంచారు.

Related Posts