YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ముమ్మర ప్రచారం

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ముమ్మర ప్రచారం

కమాన్ పూర్
కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ముమ్మర ప్రచారం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెటీలు పార్టీ మేనిఫేస్టో ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో ఇంటింటా తిరుగుతూ ప్రజలకు వివరిస్తూన్నారు. కమాన్ పూర్  మండలం కేంద్రంలో ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల గురించి మండల కాంగ్రెస్ నాయకులు తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కమాన్ పూర్  లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అందగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం క్రింద
ప్రతి మహిళకు ప్రతి నెల రూపాయలు 2500, లు 500 కి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. కల్పిస్తామని రైతు భరోసా పథకం కింద ప్రతి 15000, 12000 లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు వరి పంటకు రూపాయల 500 బోనస్. గృహ జ్యోతి పథకం ప్రతి ఇంటికి అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇంటి పథకం క్రింద ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షలు అందించనున్నారు. యువ వికాస పథకం కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు,చేయూత పింఛన్వారా ఆసరా పెన్షన్ 4,000/- రూపాయలకు పెంపు కల్పించనుందని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వ మే నని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ సయీద్ అన్వర్ రంగు సత్యం  కుక్క రవి సయ్యద్ ఇక్బాల్ మైనార్టీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు అప్సర్ గుంజపడుగు రవి రాధాకృష్ణ తిరుపతి కమాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts