YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీ కే ఎమ్మార్పీఎస్ మద్దతు

బీజేపీ కే ఎమ్మార్పీఎస్  మద్దతు

నిజామాబాద్
ఎమ్మార్పీఎస్   వ్యవస్థాపక అధ్యక్షులు  మంద కృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు జిల్లాలోని ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి , విహెచ్పిఎస్ , ఎంఎంఎస్ , ప్రజాస్వామిక వాదులు అందరూ బీజేపీకి అండగా నిలబడి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.
ఈ పత్రిక సమావేశంలో ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ  మాట్లాడుతూ" 75 యేండ్ల మాదిగల కల, 30 యేండ్ల ప్రత్యక్ష మాదిగల ఉద్యమ కల అయిన వర్గీకరణ బీజేపీ ఆధ్వర్యంలో నెరవేరబోతుందాని, ఈ విషయాన్ని జిల్లాలోని మాదిగలు అందరూ గమనించాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.
ఈ నెల 11 నాడు లక్షలాది మందితో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు భారత దేశ ప్రధాని గౌ. నరేంద్ర మోడీ గారు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అలాగే ఈ నెల 18 నాడు జరిగిన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ సమావేశానికి భారత్ దేశ హోమ్ శాఖ మత్యులు గౌ. అమిత్ షా గారు కూడా రావడం జరిగింది. ఈ సమావేశాలలో మనకు భారత దేశ అత్త్యుత్తమ నాయకులు ఇద్దరు మన లక్ష్యం అయిన వర్గీకరణ మీద స్పష్టమైన వైఖరి తెలియచేయడం జరిగింది. ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వర్గీకరణ బిల్లు పేట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలు గత 30 ఏండ్లుగా మాదిగల భవిష్యత్తు కోసం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని, ఇప్పుడు ఆ ఉద్యమం చివరి మెట్టు మీద ఉందాని తెలియచేయడం జరిగింది.
వర్గీకరణ విషయంలో కాంగ్రెస్, భారాస పార్టీలు మాదిగలను అత్యంత ఘోరంగా మోసం చేశాయని, ఆ రెండు పార్టీలకు మాదిగలు అస్సలు ఓట్లు వెయ్యద్దోని పిలుపునివ్వడం జరిగింది. మాదిగల భవిష్యత్తు కోసం మంద కృష్ణ మాదిగ గారు తప్ప ఏ నాయకుడు ఆలోచించలేదాని, ఆయన ఏ పార్టీ వ్యక్తిని కాదని, గత 30 ఏండ్లుగా మాదిగల భవిష్యత్తు కోసం మాత్రమే పోరాడుతున్నాడని, ఆయన వొంటి మీద నల్ల ఖండువా మారిన చరిత్ర లేదని, భవిష్యత్తులో కూడా మారదని తెలియచేయడం జరిగింది. ఆయన లక్ష్యం మాదిగల భవిష్యత్తు అని, ఆయన చివరి అంకం వరకు మాదిగ, సబ్బండ కులాల హక్కుల కోసమే పోరాడుతాడాని తెలియచేయడం జరిగింది.
కేసిఆర్ గారు అన్ని సమస్యల మీద ఢిల్లీ వెళ్లి మాట్లాడాడు కానీ 30 ఏండ్లుగా ఆయన కళ్ళ ముందు జరుగుతున్న వర్గీకరణ ఉద్యమం గురించి ఏనాడూ కూడా ఢిల్లీలో పోరాడిన చరిత్ర లేదని తెలియచేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ 10 యేండ్లు అధికారంలో ఉండి కూడా వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలను మోసం చేసిందని అలాగే ప్రతిపక్షంలో 10 యేండ్లు ఉండి కూడా ఒక్కనాడు కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ బిల్లు పెట్టాలని ఒక లేఖ రాయలేదని విమర్శించడం జరిగింది. కానీ బీజేపీ అగ్ర నాయకత్వం, అందులో ఈ దేశ ప్రధాని గౌ. నరేంద్ర మోడీ గారు మా మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణ చేసి మాదిగల లక్ష్యాన్ని నెరవేర్చుతామని హామీ ఇవ్వడం జరిగింది. అందుకే జిల్లాలోని మాదిగలు, వర్గీకరణను స్వాగతించే ప్రజాస్వామిక వాదులు అందరూ బీజేపీ పార్టీకి అండగా ఉండి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్, ఆకారం రమేష్, ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు శ్రీ రాములు, ఎంఎంఎస్  జిల్లా అధ్యక్షురాలు పద్మ, విహెచ్పిఎస్  జిల్లా అధ్యక్షులు బీరప్ప, ఎం ఎస్ పి  జాతీయ నాయకులు గంగాధర్, ఎమ్మెస్ పి  టౌన్ నాయకులు ఖదీర్, ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు శేకర్, యాదగిరి, ఎమ్మార్పీఎస్  బోధన్ నియోజకవర్గ నాయకులు నరేష్, జీవన్, మోహన్, సంజీవ్, సాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts