YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత

అర్హులైన ప్రతి ఒక్కరికే డబుల్ బెడ్ రూమ్ పక్క ఇళ్ళు నిర్మస్తామని ఎంపీ కవిత అన్నారు. పెదవాళ్ళ  సొంత  ఇంటి కలను నెరవేర్చేందుకు రెండు పడకల ఇళ్ళ నిర్మాణాలను ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. న జగిత్యాల జిల్లా కోరుట్ల నియజకవర్గంలోని మాదాపూర్, పైడిమడుగు, ఇయిలపూర్ లలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితఈ  గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ పక్క ఇల్లు నిర్మస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి గృహ ప్రవేశాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రైతుల కళ్ళల్లో అనందం కొరకే రైతు బంధు పధకం అమలులోకి తెచ్చామని తెలిపారు. రెండు పంటలకు కలిపి రైతులకు ఎనిమిది వేలు అందిస్తున్నామని,ఒక్కో పంటకు నాలుగు వేలు చొప్పున రైతుకు అందజేయడం జరుగుతుందని అని తెలిపారు. ఈ కార్యక్రమం లో కోరుట్ల ఎం.ఎల్.ఏ కల్వకుంట్ల విద్య సాగర్ రావు. జిల్లా కలెక్టర్ డా. శరత్ , తెరాస నేతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Posts