సూర్యాపేట
హుజూర్ నగర్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ది, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైది రెడ్డి కి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.ఇద్దరు నేతలు ఈ ఎన్నికలను పతిస్టాత్మకంగా తీసుకున్నారు. తమ ఎన్నికల నిర్వహణ చేసే వ్యక్తిని సైది రెడ్డి కిడ్నాప్ ప్రయత్నం చేశాడని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అర్థరాత్రి హుజుర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కు దిగారు. పోలీసులు ఎమ్మెల్యే కు అనుకూలంగా ఉన్నారని ఉత్తమ్ ఆరోపించారు., ఈసీ కి పిర్యాదు చేస్తానని వెల్లడించారు. అయితే, ఉత్తం టమి భయంతోనే.. ఉత్తమ్ కొత్త డ్రామాకు తెర తీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. ఆ సమయములో.. తాను మఠంపల్లి ఎన్నికల ప్రచారంలో ఉన్నా. ప్రతీ ఎన్నికల్లో.. అధికారులను ఈసీ కి పిర్యాదు చేస్తానంటూ భయపెట్టడo ఉత్తమ్ కు అలవాటే సైదిరెడ్డి ఆరోపించారు.