రామగుండం నవంబర్ 22
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 8ఇంక్లైన్ కాలని ప్రజలను కలుస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ,మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయని శాసనసభ్యుడు మాయమాటలు చెప్పి మరోసారి ఓట్ల కోసం వస్తున్నారని ఆరోపించారు. ప్రజాహితం కోరే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ తోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.అంతకు ముందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. పారిశుద్ధ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరించి తీరుతామని, ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు