YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఈసారి కృతజ్ఞత తెలుపుదాం

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఈసారి కృతజ్ఞత తెలుపుదాం

కోరుట్ల
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను,ఆమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన  సోనియమ్మకు ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కృతజ్ఞత తెలుపుకుందామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు,
భారత్ బచావో స్టేట్ కౌన్సిల్ సభ్యులు పేట భాస్కర్ పిలుపు నిచ్చారు.
బుధవారం మల్లాపూర్ మండల కేంద్రం తో పాటు ముత్యంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావుతో కలిసి భారత్ బచావో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు దఫాలుగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగించిందని అనగారిన వర్గాల హక్కులను, సంక్షేమ ఫలాలను అందించడంలో విఫలమైందని దళిత బందు పేరిట ఎస్సీ కార్పొరేషన్ ఎత్తివేసిన ఘనత కేసీఆర్ దని దయ్యబట్టారు. అటు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని సమూలంగా ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారని పేట భాస్కర్ ఆరోపించారు.
 ఈ కార్యక్రమంలో టిపిఎస్ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు షాహిద్ మహ్మద్ షేక్, మల్లాపూర్ అధ్యక్షులు ముద్దం చంద్రశేఖర్, గౌడ సంఘం మండల అధ్యక్షులు కోటగిరి ఆనంద్ గౌడ్.టిపిఎస్ జేఏసీ కార్యదర్శి నూతిపెల్లి రాజం,ఎంపిటిసి 2 మరిపెల్లి మల్లయ్య,చిట్టాపూర్ సర్పంచ్ కడకుంట్ల సాయి,వేంపేట ఉప సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్, రజక సంఘం మండల కార్యదర్శి కదురుపాకు రాజేందర్, జిల్లా రైతు వేదిక నాయకులు ఇట్టేడి శ్రీదర్ రెడ్డి, అంబేద్కర్ సంఘాల నాయకులు రామలక్ష్మణ్,మాట్ల రాజేశ్వర్, కాశవత్తుల గంగారాం,శివరాత్రి నర్సయ్య,అరికుప్పల రాజం, ఆకుతోట భూమయ్య, హుస్సేన్,జటావత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts