YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నారా ఫ్యామీలీని సస్పెండ్ చేయాలి

 నారా ఫ్యామీలీని సస్పెండ్ చేయాలి

తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు ప్రయత్నం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుని, ఆయన తనయుడు నారా లోకేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి..’ అని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మిపార్వతి. చంద్రబాబు ప్రయత్నాలను ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఢిల్లీ గులాంగిరీకి వ్యతిరేకంగా ఆత్మగౌరవంతో వచ్చిన పార్టీని ఆత్మవంచన పార్టీగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు ఒక ఆక్టోపస్, రాబందు అని ఆమె విమర్శించారు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి పార్టీని కాపాడి, ఆయన వారసుల్లో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వారసుల్లో బాలయ్యకు మాత్రమే ఎమ్మెల్యే సీటు ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెట్టడం దారుణమని ఆమె అన్నారు. జయంతికీ, వర్ధంతికి తేడా తెలియని లోకేష్‌ను మంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు అతడిని కాబోయే సీఎం అని అనడం సిగ్గు చేటు అని లక్ష్మిపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడిగా సీఎంగానో ఇంకో ముఖ్య స్థానంలోనో ఉండాల్సిన హరికృష్ణ‌కి చంద్రబాబు అన్యాయం చేశారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి ఘాట్ వద్ద సరైన ఏర్పాటు చేయలేదని.. ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణం ఎలాంటి అలంకరణ లేకుండా బోసి పోతోందని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబు నాయుడే అని ఎన్టీఆర్ అభిమానులు అర్థం చేసుకోవాలన్నారు. 

Related Posts