YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ పిర్యాదే రైతు బంధును ఆపింది మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ పిర్యాదే రైతు బంధును ఆపింది మంత్రి హరీష్ రావు

జహీరాబాద్
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి మాణిక్ రావుకి మద్ధతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి.
జహీరాబాద్ లో వెలుగులు నింపింది మన కేసీఆర్. మంచి నీళ్లు ఇచ్చింది మన కారు గుర్తు. కరెంట్ విషయంలో పక్కనే ఉన్న కర్ణాటకను గుర్తు చేసుకోండి.  తప్పిపోయి కాంగ్రెస్ కి ఓటేస్తే మూడు లేదా ఐదు గంటల కరెంటే దిక్కయితది.  రాహుల్ ప్రియాంకలు కర్ణాటకలో వంద రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇయ్యలే.  డబ్బాలో ఓట్లు పడంగనే రాహుల్, ప్రియాంకలు పోయి ఢిల్లీలో పడ్డరు. మనం జాగ్రత్త పడకపోతే ఇదే పరిస్థితి తెలంగాణకు వస్తది. కాంగ్రెస్ కి రైతులంటే కుళ్లు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పైసా ఇవ్వలే. కానీ కేసీఆర్ ఇస్తుంటే ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు ఆపిండ్రని అన్నారు.
రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంటే  బిచ్చమేస్తున్నరని కాంగ్రెస్ చెప్తోంది.  రైతు బంధుకు ఈసీ పర్మిషన్ ఇచ్చిందని చెప్పినా. ఇందులో కొత్త విషయం ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మెన్ నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసి రైతుల నోటికాడ బుక్క ఆపిండ్రు. ఎన్నిరోజులు ఆపుతరు. మూడు తారీకు తర్వాత వచ్చేది కేసీఆరే. తర్వాత రోజు టింగు టింగుమని పైసలు అకౌంట్ల పడతయి.  రైతులతో మాది ఓటు బంధం కాదు పేగు బంధం.  2017లో రైతు బంధు ఇచ్చినప్పుడు ఓట్లు లేవు. ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వట్లేదు.  కర్ణాటకలో రైతు బంధును ఆపేసిన కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తుంది. ఈ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ చేసిన రైతు బంధుపై కుట్రను వివరించాలి.  తెలంగాణ రైతులు ఓటుతో కాంగ్రెస్ కి పోటు పొడవాలి. కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలి. లేదంటే రైతు బంధు ఖతమైతది. మాణిక్ రావుని గెలిపిస్తే జహీరాబాద్ నియోజకవర్గానికి 6 వేల డబల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తాం.  సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగుతాం. లక్ష ఎకరాలకు నీళ్లిస్తాం. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే.  రిస్క్ తీసుకోకుండా కారుకు ఓటెయ్యాలి.  కాంగ్రెస్ అభ్యర్ధి నాన్ లోకల్. పైగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తున్నాడు. మాణిక్ రావు లోకల్. మాణిక్ రావును గెలిపిస్తే ఝరాసంగానికి జూనియర్ కాలేజ్ మంజూరు చేస్తామని అన్నారు.

Related Posts