మోదీ ప్రభుత్వానికి నాలుగేళ్లు నిండిన నేపథ్యంలో సోమవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మీడియాతో మాట్లాడారు. విదేశాంగశాఖ గత నాలుగేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై ఆమె వివరించారు. గడిచిన నాలుగేళ్లలో విదేశాల్లో చిక్కుకున్న90 వేల మంది భారతీయులను కాపాడినట్లు ఆమె తెలిపారు. విదేశాల్లో అనేక పర్యటనలు చేసిన మోదీ.. అనేక మంది భారతీయులను స్థానిక శిక్షల నుంచి రక్షించారన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆమె అన్నారు. ఐక్యరాజ్యసమితిలో 192 దేశాలకు సభ్యత్వం ఉందని,అన్ని దేశాలకు వెళ్లాలని మొదట్లోనే నిశ్చయించుకున్నామని,ఇప్పటి వరకు తమ అధికారులు 186 దేశాలకు వెళ్లినట్లు సుష్మా చెప్పారు. పాకిస్థాన్తో చర్చలకు సిద్ధంగా లేమని తామెప్పుడూ చెప్పలేదన్నారు. కానీ ఉగ్రవాదం,చర్చలు ఒక్కసారి కుదరవన్నారు. పాక్ ఎప్పుడూ చరిత్రను వక్రీకరిస్తుందని,వాళ్లు చట్టాన్ని నమ్మరన్నారు.