YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజంపేట ను పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తాం

రాజంపేట ను పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తాం

అన్నమయ్య
జనసేన లో చేరిన అనంతరం తొలిసారి యల్లటూరు శ్రీనివాస రాజు భారీ బలప్రదర్శనతో  నియోజకవర్గానికి మొట్ట మొదటి సారి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు 50 కి.మీ మేర భారీ ర్యాలీ నిర్వహించారు సిద్ధవటం నుంచి భారీ ర్యాలీ గా రాజంపేట కు చేరుకున్నారు.దారి పొడవునా జనసేన నాయకులు అభిమానులు ఆనందంతో పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డీ ఆర్ డి ఏ లో ఉన్నత స్థానం ఉద్యోగిగా ఉండి తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి  రాజకీయాలలోకి రావటం జరిగిందని తెలిపారు.మాధవరం లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిద్దవటం నుంచి రాజంపేట కు నా వెన్నంటే ఉండి నాకు జేజేలు పలుకుతూ జనసేన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.జనసేన అధినేత పవన కళ్యాణ్ మాలో ఎవరికీ టికెట్ ఇచ్చిన మేము గెలిపించి రాజంపేట ను బహుమతి గ ఇస్తానని అని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts