YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమయింది శ్రీవారి సేవలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమయింది శ్రీవారి సేవలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

తిరుమల
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ శనివారం ఉదయం తిరుమలలో సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తరువాత అయన ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో నియంతృత్వ పాలన అంతమయింది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చింది. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మిషన్ భగీరథ పెయిల్ అయిఙది, ఎక్కడా మంచి నీరు రావడం లేదు. కాలేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది. కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. పది సంవత్సరాలలో  ప్రజా ధనం దుర్వినియోగం పై  వైట్ పేపర్ తీసుకురావాల్సి ఉంది. అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారు.ధరణి పోర్టల్ తో కల్వకుంట్ల కుటుఙబం భూ దందాకు పాల్పడింది.రాష్ట్రంలో దోపిడిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించానని అన్నారు. ..

Related Posts