సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సోనియా గాంధీ ఫ్లేక్సీలను గుర్తు తెలియను వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. శనివారం 9 సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలో ప్రధాన కూడల్లల్లో సోనియాగాంధీ ఫ్లెక్సీల ను ఏర్పాటు చేశారు. వాటిల్లో కొన్నిటిని ఎవరో ధ్వంసం చేసారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం సిగ్గుచేటు అని అన్నారు.ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.