YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పేదలకు ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్

పేదలకు ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్

హైదరాబాద్
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా కార్యాచరణ వుంటుందని గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం అయన పేదలకు ఇళ్ల కేటాయింపుపై  సమీక్ష నిర్వహించారు. ఇండ్ల నిర్మాణానికి 3, 4 నమూనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చారు.  ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖలో గృహనిర్మాణ శాఖ వుంది. ఇతర శాఖల నుంచి సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు.  -ఇందిరమ్మ ఇళ్లపై త్వరలోనే సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష తర్వాత ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖరారు చేస్తామని మంత్రి వెల్లడించారు.

Related Posts