YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లోక్ సభలో టీయర్ గ్యాస్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

లోక్ సభలో టీయర్ గ్యాస్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

న్యూఢిల్లీ
లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన నిందితులు  నీలం కౌర్, అమోల్ షిండేగా పోలీసులు గుర్తించారు. షూస్లో టియర్ గ్యాస్ షెల్స్ పెట్టుకెళ్లి సభలో విసిరారు.  నియంతృత్వం ఇక చెల్లదు అంటూ నినాదాలు చేసారు. అప్రమత్తమయిన  భద్రతా సిబ్బంది  ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. 2001లో ఇదే రోజు పార్లమెంట్పై ఉగ్ర దాడి జరిగింది. తాజా ఘటనతో ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి...

లోకసభలో భద్రతా వైఫల్యం
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం బయట పడింది. గుర్తు తెలియిన వ్యక్తి గ్యాలరీలో నుంచి సభలోకి దూసుకొచ్చాడు. టియర్ గ్యాస్ వదిలాడు. ఈ ఘటన అలజడి సృష్టించింది. భయంతో ఎంపీలు పరుగులు పెట్టారు. స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు.  జీరో అవర్‌లో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఇద్దరి ఆగంతుకులను పట్టున్నారు. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనకు ఇవాళ్టికి 22 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు మరోసారి లోక్‌సభలోకి ఇలా ఆగంతకులు దూసుకురావడం కలకలం రేపింది. లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు దూసుకురావడం అలజడి సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భద్రతా వైఫల్యంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సూచించినట్టు తెలిపారు. ఈ ఘటన తరవాత సభ తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించాం. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు సూచించాం. ఆ ఆగంతకులు సభలో వదిలిన గ్యాస్ ప్రమాదకరమైంది కాదని ప్రాథమిక విచారణలో తేలింది. దీని గురించి భయపడాల్సిన పని లేదు"ఓ నిందితుడి పేరు సాగర్‌గా గుర్తించింది భద్రతా సిబ్బంది. దీనిపై పలువురు ఎంపీలు స్పందించారు."పబ్లిక్ గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూసుకొచ్చాడు. మరో వ్యక్తి లోక్‌సభలోని పబ్లిక్ గ్యాలరీ నుంచి టియర్ గ్యాస్ ప్రయోగించాడు. ఈ గ్యాస్ కారణంగా మాకు కళ్ల మంటలొచ్చాయయని అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ అన్నారు. మరో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఉన్నట్టుండి సభలోకి దూసుకొచ్చారని చెప్పారు.
"20 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి సభలోకి దూసుకొచ్చారు. విజిటర్స్ గ్యాలరీలో నుంచి వచ్చారు. వాళ్ల చేతుల్లో ఏవో ఉన్నాయి. వాటి నుంచి పసుపు రంగు పొగ వచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు స్పీకర్ కుర్చీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఏదో నినాదాలు చేశాడు. బహుశా ఆ పొగ విషపూరితం కావచ్చు. ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి"
- కార్తీ చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ
ఇలా జరిగింది..
ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీ ఎంపీ ఖర్గేన్ ముర్ము మాట్లాడుతున్నారు. లోక్‌సభలో జీరో ఆవర్‌ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ఇద్దరు ఆగంతకులు సందర్శకులు కూర్చొనే గ్యాలరీ నుంచి దూకి సభలోకి ప్రవేశించారు. గ్యాలరీ నుండి క్రిందికి దూకి గ్యాస్ క్యానిస్టర్‌లను విసిరారు. సభ్యులు కూర్చునే టేబుల్స్‌పై నుంచి దూకుతూ సభాపతి స్థానం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఖంగుతిన్న ఎంపీలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నాలుగు వైపుల నుంచి వారిని చుట్టుముట్టి బంధించారు.ఈ క్రమంలో ఆ ఆగంతకులు తమ షూస్‌ బయటకు తీశారని, దాన్నుంచి ఒక్కసారిగా పసుపు రంగు పొగ వచ్చిందని ఎంపీలు తెలిపారు. ఆ పొగ సభంతా నిండిపోయిందని సభ్యులు తెలిపారు. ఈ కలకలం మధ్య సభను సభాపతి వాయిదా వేశారు.లోక్‌సభలోకి వచ్చిన ఆగంతకులను భద్రతా సిబ్బంది బంధించారు. ఇద్దరి వయస్సు 35 సంవత్సరాల లోపు ఉంటుందని ఎంపీలు తెలిపారు. ఆ ఇద్దరు అర్థం కానీ రీతిలో నినాదాలు చేశారని, గందరగోళం మధ్య అవి వినిపించలేదని వెల్లడించారు.
వారిలో ఒకరి పేరు సాగర్‌ అని కొంత మంది ఎంపీలు తెలిపారు. అతను మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా గెస్ట్‌గా పాస్‌ తీసుకున్నారని అన్నారు.2001 పార్లమెంటు దాడి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం లోక్‌సభ లోపల ఒక పెద్ద భద్రతా ఉల్లంఘనలో, ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి క్రిందికి దూకి గ్యాస్ క్యానిస్టర్‌లను విసిరారు. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారని ఎంపీలు తెలిపారు.మొదట ఓ వ్యక్తి బ్యారియెర్‌పై నుంచి దూకాడు. ఆ తరవాత సభలోకి దూసుకొచ్చాడు. ఆ వ్యక్తి వెనకాలే మరో వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే ఇద్దరూ తమ షూలో నుంచి ఏదో బయటకు తీశారు. టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. అప్రమత్తమైన ఎంపీలు పరుగులు పెట్టారు. పార్లమెంట్ భద్రతా సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పార్లమెంట్ ఆవరణలో ఇద్దరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓ ఎంపీ కార్యాలయం నుంచి ఇష్యూ అయిన విజిటర్ పాస్‌లతో ఇద్దరూ విజిటింగ్ గ్యాలరీకి వచ్చినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది.
ప్రమాదకరమైన దేమి కాదు స్పీకర్
లోక్‌సభలో ఇద్దరు  ఆగంతకులు దూసుకురావడం అలజడి సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భద్రతా వైఫల్యంపై  పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సూచించినట్టు తెలిపారు. ఈ ఘటన తరవాత సభ తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. "జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించాం. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు సూచించాం. ఆ ఆగంతకులు సభలో వదిలిన గ్యాస్ ప్రమాదకరమైంది కాదని ప్రాథమిక విచారణలో తేలింది. దీని గురించి భయపడాల్సిన పని లేదు"

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఖలీస్తాన్ ఉగ్రవాదుల పనేనా
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పార్లమెంట్ పై మరో మారు దాడి జరిగింది. అయితే 2001లో జరిగిన దాడి అనూహ్యంగా జరిగితే, ఈ సారి మాత్రం చెప్పి మరీ చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తొయిబాకు, జెయిష్ ఏ  మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆ దాడిలో 5 గురు ఢిల్లీ పోలీసులు,  ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ కు చెందిన మహిళా ఉద్యోగి, ఒక తోటమాలి  ఇలా 9 మంది చనిపోయారు. ఈ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. అయితే ఇది అనూహ్యంగా జరిగిన దాడి. అయితే ఇవాళ్టి దాడిని నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే సిక్ ఫర్ జస్టిస్  నేత, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఓ వీడియో విడుదల చేశారు. 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్ పై దాడి జరిగింది. ఇప్పుడు కూడా అదే రోజు లేదా అంతకు ముందే మేం దాడి చేస్తామన్నది ఆ వీడియో సారాంశం. తనను హత్య చేయడానికి భారతదేశ భద్రతా సంస్థలు కుట్ర పన్నాయని దానికి నిరసనగా పార్లమెంట్ పై దాడి చేస్తామని చెప్పారు.గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని దాన్ని అడ్డుకున్నట్లు  అమెరికా నిఘా సంస్థలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి దాడి ఖలిస్తాన్ ఉగ్రవాదుల పనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పార్లమెంట్ పై 22 ఏళ్ల క్రితం జరిగిన దాడి రోజే దాడి జరగడం, ఇలా దాడి చేస్తామని గురపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపు వీడియోను విడుదల చేయడం అన్నట్లుగానే పార్లమెంట్ లో ఇద్దరు అగంతకులు ప్రవేశించి ప్రేక్షకుల గ్యాలరీ నుండి పార్లమెంట్ లో దూకడం వంటి సంఘటనలు అందరినీ విస్మయపరుస్తున్నాయి. ఎల్లో కలర్ గ్యాస్ ను పార్లమెంట్ లో స్ప్రే చేస్తూ, నినాదాలు చేయడం భద్రతా సంస్థల నిఘా వైఫల్యాన్ని చాటి చెబుతున్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది హెచ్చరికల నేపధ్యంలో  ఈ ఇద్దరు అగంతకులు  పార్లమెంట్ లో ప్రవేశించడం, వారితో పాటు మరో ఇద్దరిని భద్రతా సంస్థలు పార్లమెంట్ వెలుపల అదుపులోకి తీసుకున్నాయి. ఆ ఇద్దరి పాత్ర ఏంటి.  ఆ అగంతకులు ఖలిస్తాన్ ఉగ్రవాదులా, లేకా పాక్ ప్రేరిత ఉగ్రవాదులా అన్న చర్చ సాగుతోంది. ఎవరి సాయంతో పార్లమెంట్ లోకి ప్రవేశించారన్న అంశంపై కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఏది ఏమైనా 2001 పార్లమెంట్ దాడి తర్వాత మళ్లీ 22 ఏళ్లకు అదే రోజు ఈ దాడి జరగడం మన భద్రతా సంస్థల వైఫల్యంగానే చెప్పాలి.

ఆగంతుకడ్ని పట్టుకున్న గోరంట్ల
పార్లమెంట్ జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి దూకి కలర్ స్మోక్ ను విసిరిన దుండగుడి వ్యవహారం సంచలనం అవుతోంది. సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన తర్వాత ఎంపీల సీట్ల ముందుగా జంప్ చేస్తూ.. హంగామా చేశాడుు. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న కలర్ స్మోక్ తీసి బయటకు విసిరేశాడు. షాక్‌కు గురైన ఎంపీలు కొంత మంది వెంటనే బయటకు వెళ్లేందుకు పరుగులు పెట్టారు. కానీ సభలోనే ఉన్న గోరంట్ మాధవ్ వెంటే ఆ దుండగుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొద్ది సేపు ప్రయత్నించిన తర్వాత ఆ నిందితుడ్ని పట్టుకున్నాడు. చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బంది కి అప్పగించారు. మాధవ్ ను సహచర ఎంపీలు అభినందించారు. మాధవ్ మాజీ పోలీసు అధికారి. సీఐగా సర్వీసులో ఉండాగనే వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. పోటీ చేసిన మొదటి సారే ఎంపీగా ఎన్నికయ్యారు. వివాదాస్పద ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆయన ఈ సారి పార్లమెంట్ లో ధైర్య సాహసాలు చూపి అందర్నీ ఆకట్టుకున్నారు.

Related Posts