హైదరాబాద్
శబరి లో తెలంగాణ భవన్ ఓపెన్ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేసారు. సీఎం రేవంత్ కేరళ సీఎంతో మాట్లాడి అయ్యప్ప స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చూడాలి. తెలంగాణ నుంచి శబరి వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి ప్రభుత్వం అక్కడికి వెళ్ళే భక్తులను దోచుకుంటుందని అన్నారు.
భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరం అయితే వారికోసం అక్కడ తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని అయన అన్నారు