YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

10 రోజుల పాటు హిందూ ధర్మ ప్రచారం

10 రోజుల పాటు హిందూ ధర్మ ప్రచారం

విజయవాడ, డిసెంబర్ 15,
హిందూ ధర్మప్రచారంతో పాటు,  శ్రీ శోభకృత్ నామ సంవత్సర భవానీ దీక్షకు సంబంధించిన ధర్మ ప్రచారం చేయడానికి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మవారి ధర్మ ప్రచార రథాన్ని ప్రజలవద్దకు తీసుకుని వెళ్ళడానికి శ్రీకారం చుట్టింది. వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించడానికి ఈ రోజు దుర్గామల్లేశ్వర స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి ప్రచర రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ కె ఎస్ రామరావు తదితరులు పాల్గొన్నారు,ఈ ప్రచారం రథం 24వ తేదీ వరకూ 10 రోజుల పాటు విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ ఎయె ప్రాంతాల్లో అమ్మవారు పూజలను అందుకోనున్నారో పూర్తి వివరాలను తెల్సుకుందాం..
17-12-2023 న ఏ.బి కాలనీ , బుట్టావారి వీధి , పూదేడు
18-12-2023 న కొత్తవలస , చాపల ఉప్పాడ
19-12-2023 న తాళ్ళనలస , చీపురుపల్లి , శ్రీకాకుళం ,అరసవిల్లి
20-12-2023 న నరసన్నపేట ,పోలాకి , రాజారాంపురం , కొత్తరేవు ,కొరివిపేట ,గుల్లవానిపేట ,ఉమ్మలాడ,పిన్నింటిపేట, సంతబొమ్మాళి, టెక్కలి
21-12-2023 న పలాస,మిలియాపుట్టి,పర్లాకిమిడి,పాతపట్నం,హిరమండలం,శుభలై,కొత్తూరు, సీతంపేట
22-12-2023 న పాలకొండ , ఆముదాలవలస,వీరఘట్టం ,నాగూరు
23-12-2023 న గిజబ, పార్వతీపురం,బొబ్బిలి
24-12-2023 న గొల్లపల్లి , గజపతినగరం, విజయనగరం
అయ్యా గ్రామములలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావలసినదిగా చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామ రావు కోరారు.

Related Posts