హైదరాబాద్
గత బిఅర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 45ను రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వ ఏర్పాటు నిరుద్యోగుల విజయం అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల విద్యార్థి నిరుద్యోగులకు, ప్రభుత్వ ఖజానాకు విపరీతంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసులో వచ్చే జీతంతో నలుగురి నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వయోపరిమితిని పెంచాలని కోరిన దాఖలాలు లేవని అన్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్4 ఉద్యోగాలను ఆటానమస్ బాడీ కలిగిన యూనివర్సిటీలకి అప్పగించాలని కోరారు.