హైదరాబాద్: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం నుంచి బయటపడిన కొందరు వ్యక్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసారు. ఆరవఅంతస్థులో చిక్కుకున్న కుటుంబాన్ని స్థానికులు, పోలీసులు రక్షించారు.
కాగా, ప్రమాదానికి షాక్ సర్కిట్ కారణమా లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అవడం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని, తదుపరి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.