YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేసిన వనస్థలిపురం పోలీసులు

అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేసిన వనస్థలిపురం పోలీసులు

రాచకొండ
బెంగళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు నిందితుల్ని ఎస్ ఓ టి ఎల్ బి నగర్ పోలీసులు సహాయంతో వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు, వీరు వద్ద నుండి 30 గ్రామ్స్ ఎండిఎంయే ,  రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెల్తే, రాజమండ్రి కి చెందిన వీరం నాగేశ్వరరావు, సూర్యాపేట కి చెందిన జితేందర్ ఇద్దరు స్నేహితులు, నాగేశ్వరరావు కుకట్పల్లిలో షేక్ సైన్స్ లైసెన్స్ లో పని చేయగా జితేందర్ తెలుగు సినిమాల్లో డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. బెంగళూర్ కి చెందిన నైజేరియన్ వ్యక్తి వద్ద నుంచి నాగేశ్వర్ రావ్ గ్రాము 2వేలకు కొనుగోలు చేసి హైద్రాబాద్ లో 10వేలకు విక్రెయిస్తున్నారు. ఈ నెల 21వ తేదీనాడు నిందితుల ఇద్దరు బెంగళూరు వెళ్లి ఎండిఎంయే  డ్రగ్స్ కొనుగోలు చేసి వస్తుండగా వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు.

Related Posts