YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ముక్కోటి ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలంగాణలో ముక్కోటి ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

భద్రాచలం
నేడు ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రిలో ఉత్తర ద్వారం నుండి వైకుంఠ రాముడిగా స్వామివారు.దర్శనమిచ్చారు.జే గంటల సవ్వడులు,దూపపు పొగల నడుమ తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు గరుడ వాహనంపై సాక్షాత్తు వైకుంఠ రాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనంపై సీతాదేవి రాజాధిరాజా గజవాహనంపై,లక్ష్మణస్వామి, హనుమవహనంపై వారితోపాటు గోదాదేవి,నమ్మాల్వార్లు,రామానుజ స్వామివార్లు ఇతర వాహనాల్లో కొలువు తీరారు. నయనానందకరంగా సాగిన ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
వేములవాడలో…
రాజన్న సిరిసిల్ల జిల్లా. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు.

Related Posts