తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి శ్రీ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే సుప్రబాత సేవలో స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీపరిశ్రమలోని అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం పై స్పందించి తగు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. మా ఉద్యమానికి సంబంధించి కొన్ని అవకతవకలు ఎదురైయ్యాయి, శత్రువులనుంచి ఎలాంటి దాడి జరుగకుండా ఢిల్లీలో చేయబోయే పోరాటంలో అన్ని రాష్ట్రాల నుంచి సినీపరిశ్రమ లోని అమ్మాయిలు ముందుకు వచ్చి పోరాటాన్ని విజయవంతం చేయాలి స్వామి వారిని వేడుకున్నానని నటి శ్రీరెడ్డి అన్నారు.