YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒంగోలు నుంచే పోటీ చేస్తా మాజీ మంత్రి బాలినేని

ఒంగోలు నుంచే పోటీ చేస్తా మాజీ మంత్రి బాలినేని

తాడేపల్లి
ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి అయన వచ్చారు. సీఎం జగన్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థుల ఖరారు పక్రియ శుక్రవారం పూర్తవుతుందన్నారు. గిద్దలూరు అభ్యర్థి ఎవరనేది ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ చేస్తారని చెప్పారు..
''కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలన చేయాలని సీఎం నాకు సూచించారు. అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎవరు పోటీ చేస్తారనేది సీఎం జగన్ ఫైనల్ చేస్తారు'' అని బాలినేని వివరించారు. సీఎంవో నుంచి పిలుపు రావడంతో.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తదితరులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జిల మార్పుపై నేతలతో జగన్ చర్చించారని వెల్లడించారు..

Related Posts