హైదరాబాద్
మహాత్మా జ్యోతి బా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జిదారులతో ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన మాట్లాడారు. అర్జిదారుల సమస్యలను తెలుసుకుని, దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి, పరిష్కరించనున్నట్లు అర్జీదారులకు ఆమె వివరించారు. ప్రత్యేక కౌo టర్ల ద్వారా అర్జీదారుల నుండి అధికారులు దరఖాస్తు లు తీసుకున్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ ప్రజావాణి నిర్వహణను సమన్వయం చేశారు.