కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, గౌరవెల్లి, తోటపల్లి జలాశయానికి మోటార్లు సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రోజు వారీ పనుల పురోగతిని అధికారులను మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ఉండి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. అనంతరం తోటపల్లి, గౌరవెల్లి జలాశయానికి సంబంధించి మోటార్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మోటార్ల బిగింపు పనులు వేగవంతం చేయాలన్నారు. మోటార్లు, పంపులు సరఫరా చేసే యాండ్రిజ్, ఏబీబీ, సివిల్ పనులు చేసే ఐవీఆర్సీఎ్ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. డిసెంబరు 2018 కల్లా తోటపల్లి పంప్ హౌజ్ పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలని ఇంజనీర్లకు, ఏజెన్సీలకు ఆదేశించారు. బిల్లుల చెల్లింపులు సక్రమంగా ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.