YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆలూరు వైకాపాలో గ్రూపు రాజకీయలు

ఆలూరు వైకాపాలో గ్రూపు రాజకీయలు

కర్నూలు
ఆలూరు లో వైఎస్ఆర్సిపి గ్రూపు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి.  న్యూయర్ వేడుకల్లో వైఎస్ఆర్సిపి నాయకులు ఒకరు ఒకరు దూషించుకున్నారు.
చిప్పగిరి జెడ్పిటిసి విరూపాక్షి,  ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ స్వామి మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సిపి తరఫున నాకు టికెట్ రాకుంటే ప్రతిపక్షమే అధికారంలోకి వస్తాదని  విరుపాక్షి అనడంతో వివాదం చెలరేగింది. ఈ విషయంపై మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణస్వామి స్పందించారు.
తల్లిపాలు తాగి రొమ్మును గుద్దడం అంటే నీలాంటి వాడే అని అన్నారు. గుమ్మనూరు ఫ్యామిలీలో ఎవరు టికెట్ ఇచ్చిన ఒకే తాటిపై నడుస్తూ మూడోసారి ముచ్చటగా ఆలూరు నుండి ఎమ్మెల్యే గెలిపించుకొని మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడమే గుమ్మనూరు ఫ్యామిలీ లక్ష్యం ... అని ఆయన అన్నారు.

Related Posts