హైదరాబాద్
వాట్సాప్ లో 107 ఐఫోన్స్ ఆర్డర్ చేసి మోసం చేసిన ఇద్దరిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసారు సెంట్రల్ జోన్ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు గుజరాత్ కి చెందిన విజయ్. హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్ కి చెందిన వ్యాపారికి వాట్సప్ లో 107 ఐఫోన్లు కావాలంటూ ఆగంతకులు ఆర్డర్ చేసారు. మొబైల్ ఫోన్లు పంపిన అనంతరం డెలివరీ అయ్యాక డబ్బులు ఇస్తామని గుజరాత్ కి చెందిన వ్యక్తులు చెప్పారు. మొదటగా 5 లక్షల విలువైన మొబైల్స్ తీసుకొని డబ్బులు పే చేసి నమ్మించారు. ఎల్ ఆర్ నంబర్ ఆధారంగా పే చేస్తామని నమ్మించారు. డబ్బులు రాకపోవడంతో అబిడ్స్ పోలీసులకు బాధితుడు పిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసారు. ప్రత్యేక బృదం ఏర్పాటు చేసి గుజరాత్ కి సూరత్ కి చెందిన నిందితుడు ఏ2 నిరావ్ రాజు ను అరెస్ట్ చేసారు. ఏ1 విపుల్ అలియాస్ విజయ్ పరారీ లో ఉన్నాడు. 64 లక్షల విలువ చేసే 102 ఐఫోన్లనె పోలీసులు సీజ్ చేసారు. మరో 5 ఐఫోన్లు నిందితులు విక్రయించారని డిసిపి వెల్లడించారు.