YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

100 ఎకరాల్లో హైకోర్టు

100 ఎకరాల్లో  హైకోర్టు

హైదరాబాద్, జనవరి 5
తెలంగాణ కొత్త హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమి కేటాయింపు జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, ప్రేమావతిపేటలోని స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చింది. గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నూతన హైకోర్టు నిర్మాణానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Related Posts