YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాలమూరు బరిలో ఎంపీలపై విస్తృత చర్చ

పాలమూరు బరిలో ఎంపీలపై విస్తృత చర్చ

మహబూబ్ నగర్ జనవరి 19,
పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీలన్నీ పోటీకి సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు స్థానాలకు ప్రధాన పార్టీల నేతలు బరిలో నిలిచేందుకు రెఢి అయ్యారు. ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్‌లకే మళ్లీ సీటు ఇస్తుందా? లేక అభ్యర్థులను మార్చుతారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఖంగుతిన్న ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచింది కేవలం రెండు స్థానాలు మాత్రమే. అందులో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే, ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో దారుణ ఓటమి నుంచి కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపీకపై బీఆర్ఎస్ పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతో విజయం నల్లేరు మీద నడకే అయ్యింది. మహబూబ్ నగర్ ఎంపీగా మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీగా పోతుగంటి రాములు విజయం సాధించారు. ఇరువురు ఎంపీలు మెతక వైఖరి ఇతర కారణాలతో అటూ నియోజకవర్గంలో, ఇటూ అధిష్టానం మెప్పును సాధించడంలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు.మహబూబ్ నగర్ ప్రస్తుత ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మళ్లీ పోటీ చేస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు బలమైన అభ్యర్థులను బరిలో దించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నేతల కోసం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన ఆల వేంకటేశ్వర్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆల అసక్తి చూపలేదని తెలిసింది. బీఆర్ఎస్ అధిష్టానం పరిగణలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డిలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎంపీ రాములును మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎస్సీ రిజర్వడ్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రముఖ ప్రజా గాయకుడు, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను బరిలో దింపుతారని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటాలనే ప్రయత్నంలో సిట్టింగ్ ల సీట్లు ఉంటాయా… ఊడతాయా అంటూ గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది.

Related Posts