YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాలం చెల్లిన మందులకు యువతి బలి

కాలం చెల్లిన మందులకు యువతి బలి

వికారాబాద్
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మెడికల్ షాపు యజమాని, ఆర్ఎంపి డాక్టర్ నిర్వాకంతో లక్ష్మీ (18) అనే యువతి మృతి చెందింది. కాలం చెల్లిన టాబ్లెట్ వేసుకోవడం వల్ల రియాక్షన్ జరిగి యువతి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. స్వల్ప జ్వరంతో దోమ మండల కేంద్రంలో ఉన్న శివరాం అనే ఆర్ఎంపి డాక్టర్ ను యువతి కుటుంబ సభ్యులు సంప్రదించారు. ఎమ్మారెస్ మెడికల్ షాపులో మందులు ఆర్ఎంపి సూచించాడు. కాలం చెల్లిన మందులు  మెడికల్ షాప్ యజమాని ఇచ్చాడు. ఉదయం టాబ్లెట్ వేసుకున్న యువతి వెంటనే అస్వస్థత కు గురయింది. యువతిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. మెడికల్ షాప్ యజమాని, ఆరెంపి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని దోమ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పరిగి మండలం జాఫర్ పల్లిలోని మోడల్ స్కూల్లో లక్ష్మీ  ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతొంది. సంక్రాంతి సెలవులకు సొంత ఊరు పాలెపల్లి ఇంటికి వచ్చి కాలం చెల్లిన మందులకు బలి అయింది.

Related Posts