సిద్దిపేట
మహిళలు సాధారణంగా నీటి కుళాయిలా దగ్గర, నిత్యావసర సరుకుల ధరల తేడా వద్దనో లొల్లిల్లు పెట్టుకోవడం చూశాం. కానీ బస్సులో ఫ్రీ జర్నీ తెచ్చిన తంటతో సీటు కోసం లొల్లి పెట్టుకుంటున్నారు. ముందు సీట్ల కోసం జుట్టు పట్టుకున్నారు, మొన్న బట్టలు చింపుకున్నారు.. ఇప్పుడు జరిగింది అంతకు మించిందే అని చెప్పాలి. సీటు కోసం చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బస్సు సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది. ముందు మాటా మాటా పెరిగింది.. ఆతరువాత ఆ గొడవ కాస్త కాళ్ల చొప్పులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో.. చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు. మిగిలిన బస్సు ప్రయాణికులు తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సీట్ల కోసం ఇంత పోరు అవసరమా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది చూశారా సార్ అంటూ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై మరికొందరు వ్యాఖ్యాని స్తున్నారు. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహా రాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వా నికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్లో పేరొన్నారు. మహిళలకు ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దీని వలన అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్ పిల్లో పేరొన్నారు