YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డ్రగ్స్ ముఠా అరెస్టు

డ్రగ్స్ ముఠా అరెస్టు

రాచకొండ
రాజస్థాన్ నుండి హైదరాబాద్ కి డ్రగ్స్ తరలిస్తున్న ముఠా అరెస్ట్ అయిందని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. నిందితులనుంచి కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల ఎండిఎంయే  డ్రగ్స్ పట్టుకున్నాం. నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని అయన అన్నారు. ఎస్వోటీ, మిర్పెట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో నిందితులు అరెస్ట్అయ్యారు. నిందితులంతా రాజస్థాన్ కి చెందిన వారే. మొదట డ్రగ్స్ కి బానిసై.. ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్స్ గా మారారు. రాజస్థాన్ లో హెరాయిన్ 5 వేలకు గ్రామ్, ఎండిఎంయే 4 వేలకు గ్రామ్ కొని.. హైదరాబాద్ లో 12 వేలకు గ్రామ్ వరకు అమ్ముతున్నారు. రాజస్థాన్ నుంచి ప్రయివేట్ ట్రావెల్ బస్ లో డ్రగ్స్ హైదరాబాద్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత రాపిడో బైక్ సర్వీస్ ద్వారా కష్టమర్స్ కి డ్రగ్స్ పంపుతున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి ఎక్కువగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. డ్రగ్ పెడలర్స్ ఆస్తులు కూడా సీజ్ చేస్తామని అయన అన్నారు.

Related Posts